సిట్టింగ్ ఎంపీలు దూరం కావడమే ఓటమికి కారణం

82చూసినవారు
సిట్టింగ్ ఎంపీలు దూరం కావడమే ఓటమికి కారణం
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత పలువురు సిట్టింగ్ ఎంపీలు పార్టీకి దూరమయ్యారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, చేవెళ్ల-రంజిత్ రెడ్డి, పెద్దపల్లి-వెంకటేష్ నేత, వరంగల్-పసూనూరి దయాకర్, నాగర్ కర్నూల్- పోతుగంటి రాములు తదితరులు పార్టీని వీడారు. వీరిలో రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, పోతుగంటి రాములు కుమారుడు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కీలక నేతలు పార్టీని వీడటం కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణంగా నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్