విజయవాడలోని వరద బాధితులకు డ్రోన్ల సాయంతో ఆహారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

77చూసినవారు
విజయవాడలోని వరద బాధితులకు డ్రోన్ల సాయంతో ఆహారం, తాగునీరు, మందులను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పడవలు, హెలికాప్టర్లు చేరుకోలేని ప్రాంతాల్లో ఈ డ్రోన్లను వినియోగించారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నానికే దాదాపు 20 డ్రోన్లతో 10 వేలకు పైగా ఆహార పొట్లాలు చేరవేశారు. వరద బాధితులకు సహాయ సామగ్రి, ఆహారం అందించడానికి డ్రోన్లను ఉపయోగించడం రాష్ట్రంలోనే ఇదే తొలిసారని మంత్రి నారా లోకేశ్ చెప్పారు.

సంబంధిత పోస్ట్