కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప తనపై లైంగిక దాడి చేశారని ఆరోపించిన మహిళ మృతిచెందింది. బాధితురాలు అనారోగ్యంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిందని పోలీసులు వెల్లడించారు. అయితే, ఆమె వాంగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా.. ఆ మహిళ చేసిన ఆరోపణలపై యడ్యూరప్పపై బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.