కేంద్ర కమిటీల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలకు చోటు

82చూసినవారు
కేంద్ర కమిటీల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలకు చోటు
కేంద్ర టెక్స్‌టైల్, స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీల్లో తెలంగాణలోని ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలకు చోటు దక్కింది. 14 మంది సభ్యులతో ఏర్పాటైన టెక్స్‌టైల్ శాఖ సంప్రదింపుల కమిటీలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. 16 మందితో ఏర్పాటైన స్కిల్ డెవలప్‌మెంట్‌కు చెందిన కమిటీలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, వరంగల్ ఎంపీ కడియం కావ్యలకు చోటు దక్కింది.

సంబంధిత పోస్ట్