జూన్ నెలాఖరు వరకు బెంగళూరు నీటి అవసరాలు తీర్చేందుకు పరిష్కారం ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కావేరి, కబినీ నదులలో నగరానికి కావలసిన నీటిని ప్రభుత్వం నిల్వ చేసిందని ప్రకటించారు. నగరంలో ప్రతిరోజూ దాదాపు 2600 మిలియన్ లీటర్ల నీటి అవసరముందని, ఈ నీటికొరతను తీర్చడానికి కావలసినన్ని జలాలు ఉన్నాయని చెప్పారు. చుట్టుపక్కల మొత్తం 110 గ్రామాలకూ నీరు అందిస్తామని వెల్లడించారు.