మధ్యప్రదేశ్లోని జబల్పుర్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి ఓ 15 ఏళ్ల బాలిక.. ఏకంగా తండ్రిని (52), సోదరుడిని (8) చంపేసింది. మొదట బాలికపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. అనుమానంతో దర్యాప్తు చేశారు. ఆమె ఇంట్లో సోదా చేయగా ఫ్రిజ్లో మృతదేహాలు లభించాయి. ఆమె ఓ 19ఏళ్ల యువకుడితో పరారీలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, యువకుడు గత ఏడాది పోక్సో చట్టం కింద శిక్ష అనుభవించి బెయిల్పై విడుదలై మళ్ళీ ఇలా చేయడం గమనార్హం.