మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ నేత వర్ల రామయ్య ఏసీబీకి ఫిర్యాదు చేశారు. టీచర్ల బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారని, విచారణ జరపాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
‘బొత్స అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని కోరాను. బదిలీ కోసం ఒక్కో టీచర్ నుంచి రూ.3 నుంచి రూ.6 లక్షలు వసూలు చేశారు. టీచర్ల బదిలీల్లో రూ.65 కోట్ల వరకు బొత్స వసూలు చేశారు. ఎలక్షన్ కోడ్ వచ్చాక ఉపాధ్యాయులను బదిలీ చేశారు’ అని తెలిపారు.