పశ్చిమబెంగాల్లోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని కోల్కతా హైకోర్టు.. దీదీ సర్కార్ను ఆదేశించింది. ట్రాన్స్జెండర్లను కేవలం సమానంగా చూస్తే సరిపోదని అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ వారికి ఒక శాతం రిజర్వేషన్ను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను అమలు చేయాలని జస్టిస్ రాజశేఖర్ మంథా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.