TG: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. షాబాద్ మండల కేంద్రంలోని శ్రీ దుర్గా వైన్స్లో పనిచేసే చేగూరి బిక్షపతి అనే 30 ఏళ్ల యువకుడు దొంగతనానికి వచ్చిన దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో దుండగులు అతనిపై ఆయుధంతో దాడి చేసి, తలపై గట్టిగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.