కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఆ పార్టీ నాయకురాలు అల్కా లాంబా మాట్లాడారు. ఇది ‘న్యాయ్ పత్ర’ అని అన్నారు. తలుపులు మూసి ఉన్న గదుల్లో కూర్చొని చేయలేదని, ‘భారత్ జోడో యాత్ర’, భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ప్రజల పరిస్థితిని చూసి రూపొందించిన మేనిఫెస్టో అని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చేలా మేనిఫెస్టోను తయారు చేయడం అభినందనీయమని అన్నారు.