కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళ ఇందిరా గాంధీ. 1970-71 ఆర్థిక ఏడాదిలో ఆమె బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రాజీనామా తర్వాత ఆమె బడ్జెట్ను సమర్పించారు. ఆ సమయంలో ఆమె మొదటి మహిళా ప్రధాన మంత్రి, మొదటి మహిళా ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఇందిర తర్వాత 2019లో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బడ్జెట్ను ప్రేవేశపెట్టి.. రెండో మహిళగా నిలిచారు.