అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించిన బాల రాముడి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆయన ముఖంలో జీవం ఉట్టిపడుతోందని చెబుతున్నారు. విగ్రహాన్ని చక్కగా తీర్చిదిద్దిన శిల్పి యోగిరాజ్ ను నెటిజన్లు ఇప్పటికీ ప్రశంసిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన వెండి సుత్తి ఫొటోను షేర్ చేశారు. 'రామ్ లల్లా దివ్య నేత్రాలను చెక్కిన బంగారు ఉలితో పాటు ఈ వెండి సుత్తిని పంచుకోవాలి అనుకుంటున్నా' అని ట్వీట్ చేశారు. ఈ ఫొటో వైరల్ గా మారింది.