ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పాటించాలని 1955లో యునెస్కో ప్రకటించింది. అంతేకాకుండా ఇదే రోజును కాపీ హక్కుల దినోత్సవంగా జరపాలని, రచయితలు, ప్రచురణకర్తలు, పాఠకులు, టీచర్లను గౌరవించాలని సూచించింది. అలాగే ప్రతి సంవత్సరం ప్రపంచంలోని ఒక ప్రముఖ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటిస్తూ వస్తోంది. ఈ ఏడాది ఫ్రాన్స్లో ఉన్న స్టార్స్బర్గ్ అనే నగరాన్ని పుస్తక రాజధానిగా ప్రకటించింది.