చెరువులో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

84చూసినవారు
చెరువులో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
ఏపీలోని తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్బీఆర్ పురంలో విషాదం చోటుచేసుకుంది. అక్కడి శివాలయంలోని చెరువులో దీపాలు వదిలేందుకు శాంతి అనే మహిళ తన కూతుర్లతో కలిసి వెళ్లింది. మెట్లపై నుంచి దిగుతుండగా పాచికారణంగా కుమార్తెలు జారి చెరువులో పడి మృతిచెందారు. ఈ ఘటనలో కుమార్తెలు చరిత(13), రూపిక(10), రిషిక (9) మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు చెరువులో గాలించి మృతదేహాలను వెలికితీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్