టెన్త్ లో 99.70% మార్కులు సాధించిన బాలిక మృతి

557చూసినవారు
టెన్త్ లో 99.70% మార్కులు సాధించిన బాలిక మృతి
గుజరాత్ లోని మోర్బీకి చెందిన హీర్ గెతియా(16) టెన్త్ లో 99.70 శాతం మార్కులతో స్టేట్ టాపర్లలో ఒకరిగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆమె తల్లిదండ్రులకు ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. మెదడులో రక్తస్రావం కారణంగా గెతియా కన్నుమూశారు. ఆపరేషన్ చేయించినా ఫలితం లేకపోయిందని కుటుంబసభ్యులు తెలిపారు. 'ఆమె డాక్టర్ కావాలనుకుంది. ఆమె మరణించినా ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు శరీరాన్ని ఆస్పత్రికి డొనేట్ చేశాం' అని ఆమె తండ్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్