ఆరో విడత పోటీలో 338 మంది కోటీశ్వరులు

75చూసినవారు
ఆరో విడత పోటీలో 338 మంది కోటీశ్వరులు
లోక్‌సభ ఎన్నికల ఆరో విడతలో పోటీ చేస్తున్న 338 మంది (39%) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR)’ తెలిపింది. ఈ నెల 25న జరుగనున్న ఆరో విడతలో మొత్తం 57 స్థానాల్లో 869 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారిలో హర్యానాలోని కురుక్షేత్ర బీజేపీ అభ్యర్థి నవీన్‌ జిందాల్‌ అత్యధికంగా రూ.1241 కోట్ల ఆస్తులు ప్రకటించారు. సంతృప్త్‌ మిశ్రా (బీజేడీ, రూ.428 కోట్లు), సుశీల్‌ గుప్తా (ఆప్‌, రూ.169 కోట్లు) తర్వాతి స్థానంలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్