AP: రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతవరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, కృష్ణా, ఉమ్మడి తూ.గో, ఉమ్మడి ప.గో జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వివరించింది.