పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ నుంచి దోపిడీ, భూకబ్జా, లైంగిక వేధింపులు, రేషన్ కుంభకోణం నిందితుడైన షాజహాన్ షేక్ నివాసంపై దాడి చేసేందుకు సందేశ్ఖాలీకి వెళ్లిన ఈడీ అధికారులపై దాడికి సంబంధించిన దర్యాప్తును కలకత్తా హైకోర్టు మంగళవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి బదిలీ చేసింది. ఈ కేసును కేంద్ర ఏజెన్సీ టేకోవర్ చేస్తుందని, ఈ మేరకు షాజహాన్ కేసు వివరాలను అందజేయడానికి బెంగాల్ పోలీసులకు సాయంత్రం 4.30 గంటల వరకు గడువు ఇస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ శివజ్ఞానం మంగళవారం సాయంత్రం తెలిపారు.