టీఎంసీ కార్యకర్తలు నాపై కాల్పులు జరిపి, బాంబులు వేశారు: బీజేపీ నేత ప్రియాంగు పాండే

60చూసినవారు
టీఎంసీ కార్యకర్తలు నాపై కాల్పులు జరిపి, బాంబులు వేశారు: బీజేపీ నేత ప్రియాంగు పాండే
వైద్యురాలిపై అత్యాచార ఘటనకు సంబంధించి ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ హింసాత్మకంగా మారింది. ఈ క్రమంలో ఉత్తర 24 పరగణాల జిల్లాలో కారులో వెళ్తుండగా టీఎంసీ కార్యకర్తలు తనపై కాల్పులు జరిపి, బాంబులు వేశారని బీజేపీ నేత ప్రియాంగు పాండే ఆరోపించారు. "నా కారు ఆగిన వెంటనే 50-60 మంది వ్యక్తులు నా వాహనాన్ని అడ్డగించి బాంబులు విసిరి, 6-7 రౌండ్లు కాల్పులు జరిపారు" అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్