నేడు దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు

58చూసినవారు
నేడు దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజున (గురువారం) విజయవాడ కనకదుర్గమ్మ శక్తి రూపమైన దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. లోక కంటకుడైన దుర్గమాసురుణ్ణి వధించి, ఇంద్రకీలాద్రిపై దుర్గగా.. స్వయంభువై అమ్మవారు వెలసింది ఈ అష్టమి తిథి నాడేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే, ఈ అష్టమిని 'దుర్గాష్టమి' అని వ్యవహరిస్తారు. ఈ రోజున అమ్మవారి దర్శనంతో దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.

సంబంధిత పోస్ట్