జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువు మంగళవారంతో ముగియనుంది. దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాలకు సంబంధించి ఏమైనా పొరపాట్లు ఉంటే ఈ నెల 27 నుంచి 28వ తేదీ రాత్రి 11.50 వరకు సవరించుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ (NTA) ప్రకటించింది.