ఎంపీ టికెట్ల దరఖాస్తులకు నేడు చివరితేదీ

57చూసినవారు
ఎంపీ టికెట్ల దరఖాస్తులకు నేడు చివరితేదీ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకే అప్లికేషన్లకు ఛాన్స్ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫస్ట్ డే 7, రెండో రోజు 34, మూడో రోజు 140 దరఖాస్తులు వచ్చాయని టీపీసీసీ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 181 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు అధికంగా దరఖాస్తులు రాగా, హైదరాబాద్‌కు అతితక్కువ గా వచ్చాయి.

సంబంధిత పోస్ట్