శ్రీలంకలోని కిలినోచ్చి టౌన్లో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి బైక్పై రైల్వే గేట్ దాటుతుండగా ట్రైన్ వేగంగా దూసుకొచ్చింది. రెప్పపాటులోనే ఆ బైకర్ను ఆ ట్రైన్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆ బైకర్ అక్కడికక్కడే చనిపోయాడు. రైల్వే గేట్ వేసినా, ఆ బైకర్ నిర్లక్ష్యంగా రైల్వేలైన్ క్రాస్ చేయడమే ప్రమాదానికి కారణం. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.