నేడు సౌతాఫ్రికా మహిళల జట్టుతో భారత్ చివరి టీ20 ఆడనుంది. తొలి మ్యాచ్లో భారత్ ఓడిపోగా, రెండో మ్యాచ్ సౌతాఫ్రికా బ్యాటింగ్ పూర్తయ్యాక వర్షం కురవడంతో రద్దైంది. దీంతో మూడో టీ20లో గెలిచి సిరీస్ సమం చేయాలని హర్మన్ ప్రీత్ సేన చూస్తోంది. అయితే రెండు మ్యాచుల్లోనూ భారత బౌలర్లు విఫలమవ్వడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇవాళ్టి మ్యాచులో మెరుగైన ప్రదర్శన చేసి గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.