దేశంలో రేపే తొలి దశ ఎన్నికలు

2569చూసినవారు
దేశంలో రేపే తొలి దశ ఎన్నికలు
దేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలకు గానూ మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. దేశంలో రేపు తొలి దశ లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 లోక్ సభ నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సామాగ్రిని తీసుకుని అధికారులు వారి పోలింగ్ కేంద్రాలకు పయనమవుతున్నారు. అయితే ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం గడువు బుధవారం సాయంత్రంతో ముగిసింది.