హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి టోల్గేట్ సమీపంలో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఎండకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పైవంతెన నిర్మాణ పనుల కారణంగా రహదారి ఇరుకుగా మారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అరకిలోమీటరు దూరం వెళ్లేందుకు సుమారు గంట పాటు ఎండలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్మాణ పనులు నత్తనడక సాగుతుండటంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.