ఇండియా T20 వరల్డ్ కప్ గెలుచిన సందర్భంగా జరుపుకున్న సంబరాలు మధ్యప్రదేశ్లో ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. జబల్పూర్లో కొందరు పిల్లలు రోడ్డుపై స్టీల్ గ్లాస్లో బాంబును అమర్చి పేల్చారు. అది కాస్త ముక్కలై ఒక గ్లాస్ ముక్క అక్కడే ఉన్న ఐదేళ్ల బాలుడు దీపక్ ఠాకూర్ కడుపులో గుచ్చుకుంది. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.