ఆరోగ్యశ్రీలో కొత్తగా 65 వ్యాధులకు చికిత్స

56చూసినవారు
ఆరోగ్యశ్రీలో కొత్తగా 65 వ్యాధులకు చికిత్స
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ ద్వారా మరో 65 జబ్బులకు చికిత్స అందించాలని నిర్ణయం తీసుకుంది. యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నెముకకు సంబంధించిన అధునాతన చికిత్స విధానాలను ఈ పథకంలో చేర్చింది. వైద్య నిపుణుల సూచనతో ప్రస్తుత ప్యాకేజీలో ఉన్న 1,375 విధానాల ట్రీట్ మెంట్ కు అయ్యే ఖర్చులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.497.29 కోట్ల నిధుల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.