టీవీ ప్రేక్షకులకు దేశంలోని ప్రముఖ బ్రాడ్కాస్టర్లు జీ ఎంటర్టైన్మెంట్, వయాకామ్ 18, సోనీ పిక్చర్స్ సంస్థలు షాక్ ఇచ్చాయి. తమ ఛానెళ్ల ప్యాకేజీ ధరలను పెంచుతున్నట్లు తాజాగా ఈ సంస్థలు ప్రకటించాయి. జీ 9-10 శాతం, సోనీ 10-11 శాతం, వయాకామ్ 20-25 శాతం చొప్పున పెంచాయి. పెంచిన ఈ ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించాయి. ఈ ధరల పెంపు టీవీ ఛానెళ్ల బిల్లులపై పడనుంది.