గంజాయి మత్తులో రైల్వే ట్రాక్​పై ఇద్దరు యువకులు.. దూసుకొచ్చిన ట్రైన్

60చూసినవారు
గంజాయి మత్తులో రైల్వే ట్రాక్​పై ఇద్దరు యువకులు.. దూసుకొచ్చిన ట్రైన్
AP: పట్టాలపై కూర్చుని గంజాయి తీసుకుంటుండగా.. రైలు దూసుకురావడంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన ఇంటర్‌ విద్యార్థులు కిరణ్‌కుమార్‌ (18), యాసిన్‌ (17) మంగళవారం రాత్రి చిత్తూరు మార్గంలోని రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి గంజాయి తీసుకోవడం మొదలుపెట్టారు. అదే సమయంలో నాగర్‌కోయిల్‌ నుంచి ముంబయి వెళ్లే రైలు వీరిపై నుంచి దూసుకెళ్లింది. గంజాయి మత్తులో రైలు వస్తున్న విషయాన్ని వారు గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్