శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్

58చూసినవారు
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం కార్తీక మాసోత్సవాల సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. కార్తీక శని, ఆది, సోమ, పౌర్ణమి, ఏకాదశి రోజులలో సామూహిక, గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను రద్దు చేసింది. ఆయా రోజులలో స్వామివారి అలంకార దర్శనానికే అనుమతిచ్చింది. సాధారణ రోజులలో అభిషేకాలు, స్పర్శ దర్శనాలు మూడు విడతలుగా అందుబాటులో ఉండనున్నాయి. కాగా నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్