పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్, బంగ్లాదేశ్లోని కీపుపారా మధ్య రెమాల్ తుపాన్ తీరం దాటింది. అయితే ఈ తుపాన్ ధాటికి.. భారీ వర్షాలు, ఈదురుగాలులు సంభవించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పశ్చిమ బెంగాల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కోల్కతాలోని బిబి బగాన్లో పాత భవనం కూలి ఓ వ్యక్తి మరణించగా.. దక్షిణ 24 పరిగణాల జిల్లాలోని మౌసునీ ఐలాండ్లో చెట్టు మీద పడి ఓ మహిళ మరణించింది. మరోవైపు ఈ తుపాన్ ధాటికి బంగ్లాదేశ్లో సైతం ఇద్దరు మరణించారు.