అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

53చూసినవారు
అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాలో శనివారం అప్పులబాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఎడవల్లి మండలం వడ్డేపల్లిలో ఓ కుటుంబంలోని ముగ్గురు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను సురేశ్‌ (53), హేమలత (45), హరీశ్‌ (22)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్