భార్య మృతి తట్టుకోలేక భర్త, ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని అస్సాం డీజీపీ జీపీ సింగ్ స్వయంగా ఎక్స్ ద్వారా తెలియజేశారు. ఆయన తన పోస్ట్లో.. ‘ఇది దురదృష్టకర సంఘటన. అస్సాం హోం, పొలిటికల్ సెక్రటరీ షిలాదిత్య చెటియా ఈరోజు సాయంత్రం ప్రాణాలు తీసుకున్నారు. చాలా కాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న తన భార్య మరణించిన నిమిషాల వ్యవధిలోనే ఈ చర్యకు పాల్పడ్డాడు. ఈరోజు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు” అని తెలిపారు.