తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత రణభేరి మోగించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సాగిన నిరుద్యోగుల ధర్నాలు, ఆందోళనలతో తెలంగాణ దద్దరిల్లింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కదం తొక్కింది.
హైదరాబాద్లో గాంధీ ఆసుపత్రి, ఓయూ, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, బడంగ్పేట మున్సిపల్ కార్యాలయాలు కేంద్రాలుగా విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనలు నిర్వహించారు.