రాజ్యసభలో బుధవారం కేంద్ర బడ్జెట్ 2024-25పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్ధిక వ్యవస్ధ ఎదుర్కొంటున్న నాలుగు ప్రధాన సవాళ్లను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. నిరుద్యోగం దేశ ఆర్ధిక వ్యవస్ధకు పెను సవాల్ విసురుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎంఐఈ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూన్లో నిరుద్యోగిత రేటు 9.2 శాతంగా ఉందని అన్నారు.