యాపిల్ ఉత్పత్తులను వాడుతున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భద్రతా పరమైన హెచ్చరికలు జారీ చేసింది. ఐఫోన్తో పాటు ఐప్యాడ్స్, మ్యాక్బుక్, విజన్ ప్రో హెడ్సెట్లకు 'హై-రిస్క్' ఉందని, ఈ ఉత్పత్తుల్లో రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్కు సంబంధించిన ప్రధాన సెక్యూరిటీ లోపం ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపింది. కాబట్టి యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్ సెక్యూరిటీ వెర్షన్తో అప్డేట్ చేసుకోవాలని సూచించింది.