పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో హింసే అతి పెద్ద సవాల్ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను నేరుగా కలవాలని, నిర్భయంగా ఓట్లు వేసేలా వారిని ప్రోత్సహించాలని కోరారు. పశ్చిమబెంగాల్ పార్టీ కార్యకర్తలతో ప్రధాని బుధవారం నాడు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. బెంగాల్లో బీజేపీ గెలుపు స్థానాలు ఈసారి పెరుగుతాయని మోదీ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.