ముంబై-పుణె ఎక్స్ప్రెస్ వేపై అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ట్రాక్టర్ను ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత బస్సు కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. మరో 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డోంబివిలీలోని కేసర్ గ్రామం నుంచి పండర్పూర్కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంతో హైవేలోని ముంబై-లోనావాలా లేన్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.