యూపీ మీరట్లో గతేడాది జరిగిన మర్డర్ మిస్టరీ వీడింది. మొహమ్మద్ షాజిద్ గర్భిణీ అయిన భార్య పర్వీన్ను ఫిబ్రవరి 12, 2023న హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో వేసి, పారవేయడానికి చాలాసేపు తిరిగాడు. గుర్తు పట్టలేని స్థితిలో మహిళ మృతదేహం దొరకడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వెయ్యికి పైగా ఇళ్లలో సర్వే చేశారు. చివరికి మృతురాలి వివరాలు తెలుసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.