తెలుగుదేశం పార్టీకి ఎంతో నిబద్ధతతో పనిచేశానని, అయితే టీడీపీ తనను ఘోరంగా అవమానించిందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు చెప్పారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్ తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఎంతో నిబద్ధతతో పని చేసిన తనని మెడబట్టుకుని గెంటేసినంత పని చేశారంటూ మీడియా ముందు వాపోయారు. సీఎం జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ కోసం శాయశక్తుల పని చేస్తానని తెలిపారు.