అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు

74చూసినవారు
అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు
యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ బుధవారం సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసులో ఆయనను సాక్షిగా సీబీఐ చేర్చింది. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు గురువారం హాజరు కావాలని కోరింది. హమీర్‌పూర్‌లో 2012-2016 మధ్య జరిగిన అక్రమ మైనింగ్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి ఈ నోటీసు వచ్చింది. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్