యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్కు సీబీఐ బుధవారం సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసులో ఆయనను సాక్షిగా సీబీఐ చేర్చింది. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు గురువారం హాజరు కావాలని కోరింది. హమీర్పూర్లో 2012-2016 మధ్య జరిగిన అక్రమ మైనింగ్పై నమోదైన ఎఫ్ఐఆర్కు సంబంధించి ఈ నోటీసు వచ్చింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది.