ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో గెలిచి భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్లో ఫైనల్ చేరింది. భారత క్రికెటర్లు ఫైనల్ చేరిన ఉత్సాహంలో సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో డగౌట్లో కూర్చున్న రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యారు. ఆనందంతో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. కోహ్లితో సహా సహచర క్రికెటర్లు రోహిత్ను భుజం తట్టారు. ఐసీసీ టోర్నీలలో 27 మ్యాచ్లలో కెప్టెన్గా రోహిత్ 24 మ్యాచ్లలో గెలిపించారు.