టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్ చేరింది. ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో 68 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 171/7 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ జట్టు 16.4 ఓవర్లలో 103 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో 3, బుమ్రా 2 వికెట్లు తీశారు. శనివారం జరగనున్న ఫైనల్లో సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది.