కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు నమ్మరు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

55చూసినవారు
కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు నమ్మరు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని భాజపా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి చేవెళ్ల పట్టణ కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూఎన్నికల్లో లబ్ధి కోసమే గ్యారంటీ పథకాలంటూ కాంగ్రెస్ ప్రజల ముందుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. మోదీ ప్రధాని అయ్యాక దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో స్థానా నికి చేరిందని తెలిపారు. మోదీ వంటి శక్తివంతమైన నాయకుడు భారత్ కు ప్రధానిగా అవసరమని చెప్పారు. సుస్థిర ప్రభుత్వం కోసం ఓటర్లంతా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. రోడ్ షోలో భాజపా జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రత్నం, విజయలక్ష్మి, కంజర్ల ప్రకాష్, ప్రతాప్ రెడ్డి, పాండురంగారెడ్డి, అనంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకట్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్