మరుగు దొడ్లు కరువు.. అవస్థలు పడుతున్న ప్రయాణికులు

85చూసినవారు
మరుగు దొడ్లు కరువు.. అవస్థలు పడుతున్న ప్రయాణికులు
వికారాబాద్ జిల్లా బంట్వారం మండల కేంద్రానికి చెందిన ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణంలో మరుగుదొడ్లు లేక మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. మండల కేంద్రం నుండి ప్రతి రోజూ వికారాబాద్ హైదరాబాద్, సంగారెడ్డి, ఇతర ప్రాంతాలకు తరుచూ ప్రయాణికులు అధిక సంఖ్యలో ప్రయాణిస్తూ ఉంటారు. మండల కేంద్రానికి చదువు కోసం విద్యార్థులు కూడా వస్తుంటారు. వారు కూడా ఈ సమస్యలను ఎదుర్కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్