పూజా కార్యక్రమంలో పాల్గొన్న కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్

72చూసినవారు
పూజా కార్యక్రమంలో పాల్గొన్న కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్
దోమ మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామంలో బుధవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రారంభోత్సవంలో కె ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దైవచింతలతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, నాయకులు పాల్గొన్నారు.