వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని తొండపల్లి గ్రామ గేటు దగ్గర బస్సులు ఆపటం లేదని సోమవారం గ్రామంలోని మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావడం జరిగింది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తొండపల్లి గేటు దగ్గర బస్సులు ఆపే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు.