వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని బండ వెల్కిచర్ల గ్రామం నుండి పాంబండ దేవాలయానికి శనివారం రామలింగేశ్వర స్వామిని ఊరేగించారు. ఆచార సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఊరేగింపు కార్యక్రమం కొనసాగింది. దీంతో గ్రామంలో పండగ వాతావరణం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాములు, మాజీ సర్పంచ్ శిరీష, ఎంపీటీసీ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.