సమ సమాజ స్థాపనలో బసవేశ్వరుడు మార్గదర్శకుడని తాండూరు బార్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. శుక్రవారం తాండూరు కోర్టు ఆవరణలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వరుని జయంతిని జరుపుకున్నారు. అసోసియేషన్ కార్యాలయంలో బసవేశ్వర చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు. బసవేశ్వరునికి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.